
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ సనాతన ధర్మం మనకిచ్చిన రెండు అద్భుత మహామంత్రాలివి. ఒక మంత్రం నారాయణుడిని స్మరిస్తే, మరొకటి శివుడిని ఆరాధిస్తుంది. మనలో కొందరికి మహేశ్వరుడి కారుణ్యమూ, ప్రసన్న రూపమూ, ఏ వరం కోరినా కాదనకుండా ప్రసాదించే భోళాతనమూ నచ్చుతాయి. మరి కొందరికి, సాత్విక గుణస్వరూపుడైన విష్ణుమూర్తి, ఆయన అనేక అవతారాలలో చేసిన లీలలు మహాప..
‘కర్మణా బధ్యతే జంతుః’ మనిషి కర్మ అనే చక్రబంధంలో చిక్కుకుని ఉన్నాడు. ఈ చక్రబంధనాన్ని చేధించుకుని బయటపడితే కాని జ్ఞానయోగం ప్రాప్తించదు. అయితే కర్మాచరణ గొప్పదా, జ్ఞానం గొప్పదా అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలగకమానదు. కర్మయోగం, జ్ఞాన యోగం రెండూ మోక్షమార్గాలే. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్తా మయా నఘ! జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయో..
వాలి సుగ్రీవులకు మేనల్లుడను నేను వల్లభుల బంటునమ్మ ఆ వాయుసుతుడను, హనుమంతుడు నా పేరు సీతమ్మ నమ్మవమ్మ అంటూ ఎంతో ఆర్తితో హనుమంతుని ద్వారా సీతమ్మవారిని, జానపదులు భావుకతతో అర్ధించిన తీరు ఆ సీతమ్మవారినే కాదు మనందరిని కూడా అలరించకమానదు. వాల్మీకి రామాయణం కిష్కిందకాండలో ప్రవేశించే హనుమత్ స్వరూపం భగవత్ సౌందర్యాన్ని ప్రతిపాదించి, పరబ్రహ..
అవ్యక్తో యమచింత్యో య వికార్యోయముచ్యతే| తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి|| 2-25 || అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత| అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా|| 2-28 || ఆత్మ అవ్యక్తమైనది. అనగా ఇంద్రియగోచరముగానిది, మనస్సునకు అందనిది. వికారములు లేనిది. జనన మరణాల మధ్య మాత్రమే ఇంద్రియగోచరాలు ప్రకటితమవుతాయి. ఆత్మ జననమరణాలకు అతీతమైనది. నా..
రామాయన్న పదమ్మువిన్న నిదె సర్వస్వమ్ము నుప్పొంగి, ఏ సామోద్గీథములో ధ్వనించు రసవేషా! నాడులే తంత్రులై ఆమోదమ్ముగ లీలగా బ్రతుకు తానై రామసంకీర్తన మ్మై మాధుర్య తరంగమౌను శుభధామా! రామచన్ద్రప్రభూ! సామము గీతాత్మక నాదం. దానికి సారం – ఓంకారం, అదే శ్రీరామ నామం. ఆ కారణంచేత, రామస్మరణ రసవంతమైన ప్రణవానికీ, ప్రణవ జన్యమైన గీతానికి హేతువౌతోంది. ఓంకార స..
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిఃసృతా గీత శ్రీపద్మనాభుడైన విష్ణుభగవానుని ముఖారవిందము నుండి వెల్వడిందని వ్యాసుడు భగవద్గీతను వర్ణిస్తూ తెలిపాడు. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో భోధించాడని అందరికి తెలుసు. కానీ భగవద్గీత ఆవిర్భావం సంగ్రామం పదకొండవనాడు ..
పంచమవేదంగా పిలవబడే మహాభారతం మనకు నిత్యం పారాయణ చేసుకునే విష్ణు సహస్రనామం (అనుశాసనిక పర్వం), శ్రీమద్భగవద్గీత (భీష్మపర్వం 25వఅధ్యాయం నుంచి 42వ అధ్యాయంవరకు)లను అందించింది. 18 అధ్యాయాలు గల భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు స్వయంగా భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను, యోగ సాధనాలను విశదీకరించాడు. భగవద్గీతకు ఎందరో అర్ధాల..
‘భగవతః చరితం భాగవతమ్’. భగవంతుని చరితము భాగవతము. ప్రపంచోత్పత్తి, ప్రళయము, భూతలముల ఆగమనగమనములు, విద్యావిద్యలు ఎవరికి తెలియునో ఆతడు భగవంతుడని ప్రాచీన పండితులు నిర్ధేశించారు. నిర్గుణ, సుగుణాత్మకుడైన ఆత్మస్వరూప నిరూపణమే భాగవత కథ. వ్యాసుడు రచించిన అష్టాదశపురాణాలలో అత్యంత విశిష్టమైనది భాగవతం. గాయత్రి ఆధారంగా ధర్మ ప్రబోధము కలిగి, 18వేల శ్..