
హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా వివరించపడి ఉంది. హనుమంతుడు వైశాఖమాస కృష్ణపక్షమున శనివారం పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతి యోగమున మధ్యాహ్న సమయమందు కర్కాటక లగ్నాన కౌండిన్య గోత్రమున జన్మించాడు.
‘రామాయణ మహామాలా రత్నం వందే నిహత్మిజం’ అని కీర్తింపపడే హనుమంతుడు, వేదములను అనుష్టించి జీవితములోనికి అనుభవంగా తెచ్చుకున్న మహానుభావుడు. ఆంజనేయస్వామి చతుర్వేదములు, వేదాంగములు, సకల శాస్త్ర పురాణములు ఔపోసన పట్టాడు. యజుర్వేద హృదయము తెలిసిన హనుమ, వ్యాకరణ, గాంధర్వ విద్యలలో ఆరి తేరినవాడు. అందుచేతనే,
“బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్”, హనుమంతుని నామమం తలచినంతనే, బుద్ధికుశలత, బలం, కీర్తి, ధైర్యం, శక్తి, చక్కగా పొందికగా మాట్లాడగల శక్తి మొదలగునవి కలుగుతాయి.
సుందరకాండ విశిష్టత: ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను “పారాయణ కాండ” అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. బ్రహ్మాండపురాణం ఈ కాండమును “సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః” అని, “బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి” అని, “అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్” అని ప్రశంసించింది.
సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు. ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాడ శ్రీరాముని, సీత మరియు హనుమల సౌందర్యాలను దర్శంపచేస్తుంది. ఆధ్యాత్మక చింతనతో చూస్తే భగవత్సౌందర్యమును, జీవ సౌందర్యమును, ఆచార్య సౌందర్యమును సుందరకాండ వర్ణిస్తుంది.
సుందరే సుందరో రామః
సుందరే సుందరీ కథః
సుందరే సుందరీ సీత
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపిః
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం?
అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ.
మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు ఆమె వసించును కావున ఇది సుందరకాండమైందని గుంటూరు శేషేంద్ర శర్మ తన ‘షోడశి – రామాయణ రహస్యములు’ అనే పుస్తకాంలో అభిప్రాయపడ్డారు.
తతో రావణనీతాయహ్ సీతాయహ్ శత్రుకర్షనహ్
ఇయెష్ట పదమన్వెష్ణుం చారణచిరితె పథి
సుందరకాండ ‘తత్’ అనే పదంతో కూడిన పైపద్యంతో మొదలవుతుంది. తత్ అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసనచేయాలో సుందరకాండ వివరిస్తుంది. అందుకే దీనిని ‘ఉపాసనకాండ‘ అని కూడా అంటారు.
అటువంటి సుందరకాండను పారాయణం చేసే క్రమము:
సంక్షేప రామాయణం, శ్రీరామావతారము, సీతాకళ్యాణము, సీతారామోయోః సుఖజీవనము, నాగపాశము విమోచనము, ఆదిత్య హృదయము, రావణవధ, బ్రహ్మకృత రామస్తుతి, పట్టాభిషేకము. ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు.
తేటగీతి
శ్రీవిద్యోపాసకుడు
శేషేంద్రుడు ఒక స్వర్ణహంస
ప్రొ.ముదిగొండ శివప్రసాద్
చారిత్రక నవలాచక్రవర్తి
శ్రీహర్షుడు అనే పేరుతో భారతదేశంలో ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులున్నారు. ఒకడు రాజు. ‘నాగానందము, ప్రియదర్శిక రత్నావళి’ అనే గ్రంథములను రచించిన బౌద్ధధర్మ పక్షపాతి. రెండవవాడు శ్రీవిద్యోపాసకుడైన కవి పండితుడు. ఇతడు నైషధీయ కావ్యము సంస్కృతంలో రచించాడు. దీనిని తెలుగులోకి శృంగార నౌషధము పేరుతో శ్రీనాథుడు క్రీ.శ. 15వ శతాబ్ధములో అనువదించాడు. శ్రీనాథుడు శైవుడు. ఆయనకు శాక్తేయమును గూర్చి కూడా పరిచయము లేదు అని చెప్పలేము కాని శ్రీహర్షుని నైషధములో దమయంతి, శ్రీదేవి అనే రహస్యాన్ని అందుకోలేకపోయాడు. మరి ఇన్ని వందల సంవత్సరాలు మరుగునపడిన ఒక తాత్త్విక రహస్యము ఒక అత్యాధునికుడైన తెలుగు కవి శేషేంద్రునికి ఎలా తెలిసింది? ఇది ఆశ్చర్యము కల్గించే విషయము. అరవిందునికి సావిత్రీ మంత్ర రహస్యము తెలిసింది. దానినే ఆయన ‘సావిత్రి ఎ లెజెండ్ అండ్ ఎ సింబల్’’ అనే ఆంగ్ల గ్రంథముగా రచించాడు. అలాగే గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ‘స్వర్ణ హంస’ నైషధ కావ్యానికి తాంత్రిక వాఖ్యానము. మరి షోడశిలో త్రిజటాస్వప్నము, గాయత్రీ మంత్రము అనే రహస్యము శర్మగారికి తెలిసింది. దీనిని బట్టి గుంటూరువారు నిగూఢయోగి అని అర్థం అవుతుంది.
శేషేంద్రశర్మగారితో నాకు దాదాపు 60 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది. అందరూ ఆయన రచించిన ఇతర ఆధునిక వచన కవితారచనలను చూచి ముచ్చటపడుతారు కాని స్వర్ణహంస, షోడశి రామాయణ రహస్యములు చదివిన వారి సంఖ్య ఎంత? చదివినా అర్థం చేసుకున్నవారెందరు?
చిరంజీవి సాత్యకి ఇప్పుడు స్వర్ణహంసాలోకనం చేయవలసిందిగా నన్ను కోరాడు. ఇతడు గొప్ప పితృభక్తి పరాయణుడు. కాబట్టే ఈ గ్రంథాలు వస్తున్నాయి. అజపా గాయత్రి, చింతామణి మంత్రాలు సాధకులకు తెలిసన విషయములే. ముఖ్యంగా శ్రీవిద్యోపాసకులు నేటికీ దేశంలో చాలామంది ఉన్నారు. వారంతా నైషధము చదివినవారు కాదు. శ్రీహర్షుడు శ్రీవిద్యోపాసకుడని ఇప్పుడు శేషేంద్రశర్మ గారి ద్వారా మనకు అర్థమవుతున్నది.
దీనికి మంత్రము, యంత్రము, పూజాపద్ధతి ఉన్నవి. మంత్రమునే పంచదశి అంటారు. శంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని ‘‘చతుర్భిశ్ర్శీకంఠైః’’ శ్లోకం వాఖ్యానంలో అధ్యయనం చేయండి. చాలా విషయాలు తెలుస్తాయి.
ఆధునిక సాహిత్యంలో చాలా వైవిధ్యాలు, వైరుధ్యాలు ఉన్నాయి. కాని నీర క్షీర వివేచన చేయగలిగిన హంసలే తక్కువ. ఇందులో శేషేంద్రుడు ఒక స్వర్ణహంస.
వేదమాతరమ్ మాసపత్రిక
మే 2017 దుర్మిఖి కార్తిక పూర్ణిమ
15`11`2016
————–
షోడశి – రామాయణ రహస్యం : -ముదిగొండ శివప్రసాద్
షోడశి తెలుగు మూలం
గుంటూరు శేషేంద్రశర్మగారి రామాయణ రహస్యములు
ఆంగ్లానువాదం: గురజాడ సూర్యనారాయణమూర్తి;
గుంటూరు శేషేంద్రశర్మగారు బహుగ్రంథకర్త. లోగడ తెలుగులో షోడశి -స్వర్ణహంస వంటి గ్రంథములలో సుప్రసిద్ధులైనారు. కవిగా పరిశోధకునిగా వారి స్థానము ఆధునిక తెలుగు సాహిత్యంలో పదిలము. షోడశి అంటే పరిపూర్ణ చంద్రబింబము. షోడశి అంటే ఒక కుండలినీ మహావిద్య. ఆదిపరాశక్తికి ఒక పేరు. ఇది యోగ సాధకులకు తెలిసిన విషయమే. కాని రామాయణములోని సీత షోడశీ విద్యాసంకేతమని ఎందరికి తెలుసు? రామాయణము పైకి కథాకావ్యంగా కన్పడుతున్నా ఇదొక యోగ శాస్త్రగ్రంథము అని ఎందరికి తెలుసు? త్రిజటాస్వప్నము గాయత్రీ మంత్రసారమని శేషేంద్ర నిరూపించారు. రామాయణంలోని కవితాత్మ కథా కావ్యము మాట అటుంచి చారిత్రక రహస్యములపై పరిశోధన అంతగా జరుగలేదు. శేషేంద్ర ఒక పరిశోధకునిగా తులనాత్మక విశే్లషణా విమర్శకునిగా ఈ పని చేశారు. గురజాడ సూర్యనారాయణమూర్తిగారు పేరెన్నికగన్న శాస్తవ్రేత్త. వారీ తెలుగు షోడశిని ఆంగ్లంలోనికి తీసుకొని వచ్చారు. ఇది ముదావహము. తెలుగు గ్రంథములు. ఆంగ్లంలోకి రాకపోవటంవల్లనే తెలుగు కవులకు రావలసినంత అంతర్జాతీయమైన గుర్తింపురావటం లేదు అనేది అందరకు ఎరిగినదే. షోడశి ఇప్పుడు అంతర్జాతీయమైంది. ఇందుకు అనువాదకులు ప్రచురణకర్తలూ అభినందనీయులు. ఈ గ్రంథము శేషేంద్రశర్మగారి చిన్నకుమారుడు సాత్యకికి అంకితం చేయబడింది. ఆయన పరిశ్రమలవల్లనే ఈ తెలుగు, ఇంగ్లీషు గ్రంథాలు ముద్రణకు నోచుకున్నాయి. అనువాదం చాలా సరళంగా ఉంది. సాంకేతిక పదాలు సందర్భోచితంగా యధాతథంగా సంస్కృత మూలాలనే ఉదాహరించారు. సూర్యనారాయణమూర్తిగారి ప్రతిభనూ శేషేంద్రగారి మనీషను తెలుసుకోవాలని అనుకునేవారు మాత్రమేకాకుండా రామాయణంలోని వాల్మీకి హృదయమును అందుకోవాలని భావించే పరిశోధకులు కూడా ఈ షోడశిని చదవ వలసి ఉంటుంది.
-ముదిగొండ శివప్రసాద్
అక్షర
, Andhra bhoomi – Telugu News Paper
Published Friday, 12 February 2016
హనుమంతుడు ఒక శ్రీవిద్యోపాసకుడిగా……..
…. – వాడ్రేవు చినవీరభద్రుడు
————-
MARCH 2, 2024BY VADREVU CH VEERABHADRUDU
సమాశ్వాస సౌందర్య గాథ
మొన్న ఒక రోజు కూచుని మొత్తం సుందరకాండ మరోసారి చదివేను. మనశ్శాంతికోరుకునేవారు, తాము తలపెట్టిన పనుల్లో విజయం సిద్ధించాలనుకునేవాళ్ళూ, తమ మనసుని నిర్మలం చేసుకోవాలనుకునేవాళ్ళూ, తమ ఆత్మని ఒక ఔన్నత్యం వైపుగా తీసుకుపోవాలనుకునేవాళ్ళూ, సుందరకాండ పారాయణం చెయ్యడం ఈ దేశంలో తరతరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. 68 సర్గల ఆ కాండ దానికదే ఒక కావ్యంగా, పవిత్రగ్రంథంగా, రామాయణసారంగా పరిగణనకు నోచుకుంది. మహాభారతం నుంచి విడివడి భగవద్గీత ఎలా ఒక ఆధ్యాత్మిక, యోగవిద్యాగ్రంథంగా గుర్తింపు పొందిందో, సుందరకాండ కూడా రామాయణంతో సమానంగా గౌరవం పొందిందని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు.
కాని ఆ కాండ చదివిన ప్రతి ఒక్క పాఠకుడికీ ఒకే రకమైన అనుభూతి సిద్ధిస్తుందని చెప్పలేం. గుంటూరు శేషేంద్ర శర్మకి ఆ కాండ మొత్తం శ్రీవిద్యాసారంగా కనిపించింది. సీతమ్మవారు శ్రీవిద్యగానూ, హనుమంతుడు ఒక శ్రీవిద్యోపాసకుడిగానూ ఆయనకు కనబడ్డారు. తనకి కలిగిన దర్శనాన్ని ఆయన ‘షోడశి,రామాయణ రహస్యాలు’ అనే పుస్తకంగా రాసారు కూడా. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ సుందరకాండను శేషేంద్ర చదివినపద్ధతి చూసి నిలువెల్లా చకితుడైపోయాడు కూడా. షోడశిలో గొప్ప విషయమేమిటంటే, శేషేంద్ర తన దర్శనం మొత్తాన్ని వాల్మీకి శ్లోకాల ఆధారంగానే వివరించడం. ఎక్కడా ఒక్క మాట, ఒక్క భావన శేషేంద్ర అదనంగా చెప్తున్నట్టు ఉండదు. చూడబోతే షోడశి చదివాకనే వాల్మీకి సుందరకాండ రాసాడా అనిపిస్తుంది మనకి!
http://www.facebook.com/shodasi/
———-
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
జననం
1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం
2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి
clip_image002.pngసుబ్రహ్మణ్య శర్మ
తల్లి
అమ్మాయమ్మ
భార్య /
జానకి
పిల్లలు
వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
సౌందర్యమే ఆయనకు అలంకారం,సౌందర్యమే ఆయనకు జీవితం
విమర్శకుడు : కవి
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com