ఆధ్యాత్మికము

ఆధ్యాత్మికము

దైవీ ప్రవృత్తులను కలసి అఖండ విశ్వవ్యాపక చైతన్యశక్తిని జాగృతం చేసి, లోక హింసాకారకులైన రాక్షసశక్తులన్ని నశింపజేసే విజయమే నిజమైన విజయం. మన చుట్టూ ఉన్న జగత్తులో ఆ విజయం సంభవిస్తే లోక క్షేమకరం. వ్యక్తిలో దనుజ ప్రవృత్తిని దైవీ ప్రవృత్తి జయిస్తే అది వ్యక్తికి సార్ధకత. ఈ విజయానికి సంకేతంగా జరుపుకునే పర్వదినమే ‘విజయ దశమి’. నవరాత్రుల పూజ .....
శరన్నవరాత్రులు పదిరోజుల ఉత్సవం. శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అమ్మవారిని పూజిస్తారు. అందువల్లనే ఈ ఉత్సవాలని ‘దేవీ నవరాత్రులని’ కూడా పిలుస్తారు. పండుగ మొదటి మూడురోజులు పార్వతీదేవిని, తర్వాతి మూడురోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు సరస్వతీదేవిని పూజిస్తారు. అందు తొలిరోజు కనకదుర్గాదేవి, రెండోరోజు బాలా త్రిపుర స.....
సృష్టి, స్థితి లయకారిణి అయిన ఆదిపరాశక్తి అంశాలు అనేక శక్తి ప్రధాన క్షేత్రాలలో శక్తిపీఠాలుగా విశిష్టతను సంతరించుకున్నాయి. శివపురాణం మనకు ఈ శక్తిపీఠాల ఆవిర్భావ కథను తెలుపుతోంది. బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడు.....
8. శ్రీ ఏకవీరాదేవి – మహుర్వం: దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా | ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ | రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ | కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా || అమ్మవారి కుడి చేయి ఈ ప్రాంతంలో పడింది. తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తల్లి, సోదరుల తలలు నరికేశాడు. తల్లి శిరస్సు పడిన ప్రాంతమే ఈ క్షేత్రమని కూడా కథ.....
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. 'న కార్తీక నమో మాస: న దేవ కేశవా త్పరమ్! నచ వేదం నమం శాస్త్ర, న తీర్థం, గంగా యాన్స్ మమ్!!' అంటారు. ఈ మాస.....
భారతదేశంలో విభిన్న సాంప్రదాయాలకు, ఆచారాలకు పుట్టినిల్లు. పేర్లు, పద్దతులు వేరైనా కొన్ని పండగలు దేశమంతటా ప్రసిద్ది చెందాయి. శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతాలు పూర్తికాగానే భాద్రపదమాసంలో గణపతి నవరాత్రులు ఇక ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు మన తెలుగువారే కాక ఉత్తర, దక్షిణాది వారంతా పెద్ద యెత్తున జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో దసరా ఉత్సావ.....
‘‘పరిత్రాణాయ సాధూనా, వినాశాయచ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ, సంభవామి యుగే, యుగే’’ సాధు పరిత్రాణం, దుష్కృత వినాశం, ధర్మ సంస్థాపన – ఈ మూడు పరయోజనాల సిద్ధికి తాను మళ్లీ, మళ్లీ అవతరిస్తానని భగవంతుడు గీతలో తెలిపాడు. ఎవరీ సాధువులన్నదానికి కూడా భగవంతుడు గీతలో సమాధానమిచ్చాడు. ఆర్త భక్తులు, జిజ్ఞిసువులు, అర్థకాములు మరియు తత్త్వజ్ఞానులు. వ.....
విఘ్నసంహారానికి అవతరించిన పరబ్రహ్మయే గణపతి. సృష్టికి పూర్వమే బ్రహ్మకు విఘ్నాలు కలుగినప్పుడు, బ్రహ్మ ఓంకార ధ్యానంచేయగా, ఆ ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవతేజమే అటుతర్వాత పార్వతీపరమేశ్వరుల పుత్రునిగా ఆవిర్భవించింది. శివశక్తుల సమైక్యతత్త్వం, ప్రకృతీపురుషుల ఏకత్వం వినాయకమూర్తిలో ద్యోతక.....
మేలిమి గుణాలు, శోభ, కళ, సంపద, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం, సౌమనస్యం .... ఈ శుభ గుణాలకు సాకారమే శ్రీ లక్ష్మి. ఈ శుభగుణాలే ప్రతివారు ఆశించేవి. అందుకే లక్ష్మీ ఆరాధన. శ్రావణ మాసం కొత్తందాలు, కొత్త మొలకలు, పచ్చదనాలు మొదలయ్యే చల్లని నెల. వర్షాకాల వైభవంలో శ్రావణమాసం పవిత్రమైన దేవీ పూజలకు తరుణం. ‘ఆర్ద్రాం పుష్కరిణీం’ అని శ్రీ సూక్తం వర్ణించినట.....
పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడమాసంగా వ్యవహరిస్తాము. ఈ ఆషాడ మాసాన్ని శూన్య మాసమని కూడా అంటారు. ఈ మాసంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి తిరిగి సూర్యుడు మకరరాశిలోనికి ప్రవేశించేంత వరకు దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా ప్రయాణిస్తాడు. ఈ మాస.....
భారత దేశంలో ఏ మూలకెళ్లినా రామాయణ గాథ వినపడక మానదు! తెలుగునాట నాలుగు ఇళ్లున్న వాడలో రామ మందిరం లేకుండా ఉండదు! తెలుగునాట రామాయణం నిత్య పారాయణ గ్రంథం. ‘శ్రీరామ’ పదం చుట్టకుండా తెలుగువాడెవడు రాత మొదలెట్టడు.‘శ్రీ రామ రక్ష’ అని బిడ్డలను ఆశీర్వదించని తల్లీ ఉండదూ. పవిత్ర గోదావరీ తీరం సీతారాముల పాద స్పర్శతో పావనమగుచేత కామోసు సీతారాముడు ఆంధ.....
16. మత్య్యపురాణం శ్రీ మహావిష్ణువు సప్త కల్పంలో వైవస్వత మనువునకు ఉపదేశించిన ఈ పురాణం అష్టాదశ పురాణాలలో పదహారవది. మత్స్యపురాణాన్ని విష్ణుమూర్తి యొక్క మెదడుతో పోలుస్తారు. మొత్తం 14వేల శ్లోకాలు గల ఈ పురాణాన్ని 289 అధ్యాయాలలో చెప్పబడింది. మహావిష్ణువు నిద్రిస్తే ప్రళయం, మేల్కుంటే సృష్టిస్థితని మత్స్యపురాణం తెలుపుతోంది. మత్స్యావతార వర్ణ.....